అక్షరటుడే, బాల్కొండ: Mutyala Sunil Kumar | వేముల ప్రశాంత్ రెడ్డికి (Vemula Prashanth Reddy) రైతుల గురించి (Farmer Issues Telangana) మాట్లాడే అర్హత లేదని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Mutyala Sunil Kumar | తొమ్మిదేళ్ల పాలనలో అనేక ఇబ్బందులు..
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బాల్కొండ ప్రజలు (Balkonda Politics) అనేక ఇబ్బందులు పడ్డారని సునీల్కుమార్ అన్నారు. పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రోడ్డెక్కిన రైతులపై కేసులు పెట్టించారని ఆరోపించారు. మహిళా రైతులను కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన బద్దం రజిత అనే మహిళ రైతుపై కేసులు పెట్టించారని, ఆమె మరణం రైతాంగానికి బాధాకరమని అన్నారు. రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి అప్పటి పాలనలో ఏర్పడిందని విమర్శించారు.
కాంగ్రెస్.. రైతుల పార్టీ..
కాంగ్రెస్.. రైతుల పార్టీ అని (Congress Party Telangana), సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తోందని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని, రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాల్కొండ నియోజకవర్గ రైతులు ఇక ప్రశాంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
