Mutyala Sunil Kumar | ప్రశాంత్ రెడ్డికి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు: ముత్యాల సునీల్ కుమార్

వేముల ప్రశాంత్ రెడ్డికి రైతులపై మాట్లాడే అర్హత లేదని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, బాల్కొండ: Mutyala Sunil Kumar | వేముల ప్రశాంత్ రెడ్డికి (Vemula Prashanth Reddy) రైతుల గురించి (Farmer Issues Telangana) మాట్లాడే అర్హత లేదని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

Mutyala Sunil Kumar | తొమ్మిదేళ్ల పాలనలో అనేక ఇబ్బందులు..

తొమ్మిదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో బాల్కొండ ప్రజలు (Balkonda Politics) అనేక ఇబ్బందులు పడ్డారని సునీల్​కుమార్​ అన్నారు. పంటలు ఎండిపోతున్నాయని చెప్పి రోడ్డెక్కిన రైతులపై కేసులు పెట్టించారని ఆరోపించారు. మహిళా రైతులను కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన బద్దం రజిత అనే మహిళ రైతుపై కేసులు పెట్టించారని, ఆమె మరణం రైతాంగానికి బాధాకరమని అన్నారు. రైతులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి అప్పటి పాలనలో ఏర్పడిందని విమర్శించారు.

కాంగ్రెస్.. రైతుల పార్టీ..

కాంగ్రెస్.. రైతుల పార్టీ అని (Congress Party Telangana), సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తోందని ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మీద అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని, రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాల్కొండ నియోజకవర్గ రైతులు ఇక ప్రశాంత్ రెడ్డిని నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Telangana budget | మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. 20న తెలంగాణ బడ్జెట్!

అక్షరటుడే, హైదరాబాద్​: Telangana budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల ముహూర్తం నిర్ణయం అయింది. వచ్చే నెల (మార్చి) 16వ తేదీ నుంచి...

Dharmapuri Sanjay Post | ధర్మపురి సంజయ్​కు గౌరవప్రదమైన పదవి ఇవ్వాలి..

అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay Post | మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​కు (Dharmapuri Sanjay) గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరుకాపుల...

Hyderabad Park Encroachments | పార్కుల క‌బ్జాపై హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Park Encroachments | హైదరాబాద్​లో అనేక పార్కు స్థలాలు కబ్జాలకు గురి అయ్యాయి. లే అవుట్​ వేసిన సమయంలో...

Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Cabinet Decisions | తెలంగాణ కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన...