Homeజిల్లాలునిజామాబాద్​National level athletics | జాతీయస్థాయి అథ్లెటిక్స్​లో రాణించాలి

National level athletics | జాతీయస్థాయి అథ్లెటిక్స్​లో రాణించాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: National level athletics | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (athletics) పోటీల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ జిల్లా క్రీడాకారులు రాణించాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ (Nizamabad athletics association) జిల్లా అధ్యక్షుడు నరాల రత్నాకర్ అన్నారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం నగరంలోని ఆర్అండ్​బీ అతిథి గృహంలో (R&B Guest house) సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా క్రీడాకారులు పతకాలు సాధిస్తున్నారంటే కోచ్ రాజాగౌడ్ కృషి ఎంతగానో ఉందన్నారు. నిజామాబాద్​లో అతి త్వరలో సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్​ను (Synthetic athletics track) ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత ముందుకు వచ్చి అథ్లెటిక్స్​ను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజా గౌడ్, ఉపాధ్యక్షుడు కపిల్ పవర్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

National level athletics | రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించింది వీరే..

  • అండర్ 20 జావెలిన్ త్రో లో షేక్ సోహెల్ కాంస్య పతకం, షార్ట్ పుట్​లో గాయత్రి కాంస్య పతకం.
  • అండర్ 18 జావెలిన్ త్రోలో జైపాల్ బంగారు, శివరాజ్ కాంస్యం.
  • లాంగ్ జంప్ లో ప్రణయ్ కాంస్య పతకం.
  • అండర్ 16 జావెలిన్ త్రోలో ఉజ్వల, షేక్ అబ్దుల్ కపూర్ కాంస్య పతకం.
  • అండర్ టెన్ బాలుర 60 మీటర్ల విభాగంలో జిస్సన్ రజతం పతకం సాధించారు.