అక్షరటుడే, హైదరాబాద్: Musi Riverfront development : మూసి నదీ (Musi River) తీరం అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ.1500 కోట్లు మంజూరు చేయగా.. తాజాగా రెండో త్రైమాసికానికి రూ.375 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Musi Riverfront development : ఆ ఖాతాలో నిధుల జమ
మూసి రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. ఈమేరకు మేయర్, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇటీవల జారీ చేసిన బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆధారంగా ఈ మూసీ నదీ తీరం అభివృద్ధి పనులకు నిధుల విడుదల చేపట్టారు.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా నిధులు PD A/C నెం. 379 లో జమ కానున్నాయి. ఇక ఖర్చుల వివరాలు, వినియోగ ధ్రువపత్రాలను ఖాతా నియంత్రణాధికారి (AG)కి సమర్పించాలని MRDCL మేనేజింగ్ డైరెక్టర్ను సర్కారు ఆదేశించింది.