అక్షరటుడే, వెబ్డెస్క్ : Mumbai Metro Pillar Collapse | ముంబైలో మెట్రో పిల్లర్ కూలింది. అది కారు, ఆటోపై పడటంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
ముంబైలోని ములుండ్లో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ (Metro Pillar) కూలిపోయింది. కదులుతున్న ఆటోరిక్షా, కారుపై పిల్లర్ పడటంతో నలుగురు గాయపడ్డారు. జాన్సన్ అండ్ జాన్సన్ ఫ్యాక్టరీ ముందు ఉన్న ఆర్టరీ ఎల్బీఎస్ రోడ్డు (Artery LBS Road)లో ఈ సంఘటన మధ్యాహ్నం 12:20 గంటల ప్రాంతంలో జరిగింది, నిర్మాణ సమయంలో సిమెంట్ నిర్మాణంలోని ఒక భాగం నేరుగా కదులుతున్న ఆటోరిక్షాపై పడింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా.. కారు స్వల్పంగా దెబ్బతింది.
Mumbai Metro Pillar Collapse | సహాయక చర్యలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రులకు తరలించారు. వెంటనే రక్షణ, భద్రతా ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అమలు చేస్తున్న ముంబై మెట్రో లైన్ (Mumbai Metro Line) 4లో నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. రెండు రోజుల్లో వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామని MMRDA ప్రతినిధి తెలిపారు. నిర్మాణ పనులను రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ కాంట్రాక్టర్ అయిన మిలన్ రోడ్ బిల్డ్ టెక్ నిర్వహిస్తోంది.