Homeజిల్లాలునిజామాబాద్​MRPS | ఛలో హైదరాబాద్​కు తరలిన ఎమ్మార్పీఎస్​ నాయకులు

MRPS | ఛలో హైదరాబాద్​కు తరలిన ఎమ్మార్పీఎస్​ నాయకులు

ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు చలో హైదరాబాద్​ కార్యక్రమానికి తరలివెళ్లినట్లు నాయకులు పేర్కొన్నారు. ఇందల్వాయి నుంచి కార్యకర్తలు వెళ్లినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: MRPS | ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (mandakrishna Madiga) పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా నాయకులు ఛలో​ హైదరాబాద్​ (Chalo Hyderabad) కార్యక్రమానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్​ నాయకుడు కిష్టయ్య మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్​పై (Supreme Court Chief Justice Gavai) జరిగిన దాడిని ఖండిస్తూ ఇందల్వాయి టోల్​ప్లాజా నుంచి హైదరాబాద్​కు వెళ్లి అక్కడ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని కాపాడుకునే క్రమంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వివరించారు. నిజామాబాద్​ రూరల్​ నియోజకవర్గం (Nizamabad Rural Constituency) నుంచి వందల సంఖ్యలో ఎమ్మార్పీఎస్​ కార్యకర్తలు తరలివెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంధమాల నాగభూషణం, ధర్పల్లి మండల ఇన్​ఛార్జి నక్క రాజేందర్​, డిచ్​పల్లి ఇన్​ఛార్జి డప్పు నర్సయ్య, సిరికొండ మండల అధ్యక్షుడు దీపక్, శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News