Homeజిల్లాలునిజామాబాద్​Pension Scheme | పింఛన్లు పెంచాలని ఆందోళన

Pension Scheme | పింఛన్లు పెంచాలని ఆందోళన

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Pension Scheme | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్​ ప్రభుత్వం పింఛన్లను పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్​, వీహెచ్​పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బోధన్​ తహశీల్దార్​ కార్యాలయం (Tahsildar Office) ఎదుట సోమవారం ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా వీహెచ్​పీఎస్​ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) ఎన్నికల ప్రచారంలో భాగంగా పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. రెండేళ్లు గడుస్తున్నా హామీని అమలు చేయట్లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా పింఛన్లను పెంచి.. మంజూరు చేయాలని వారు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్​ జిల్లా కార్యదర్శి భూమయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.