అక్షర టుడే, ఇందూరు: MP Raghunandan Rao | నిజామాబాద్ Nizamabad బిడ్డలుగా కాకుండా ఇందూరు బిడ్డలుగా కాషాయాన్ని గెలిపించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తా, హనుమాన్ జంక్షన్ చౌరస్తాలో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చే శక్తి కేవలం నగర ఓటర్ల పైనే ఉందన్నారు. ఎంఐఎం – కాంగ్రెస్ ములకత్ తో కాకుండా బీజేపీతో మేయర్ అయ్యే అవకాశాన్ని ఇవ్వాలని అభ్యర్థించారు.
MP Raghunandan Rao | ప్రధాని వచ్చే అవకాశం..
ఇటీవల కేరళ Kerala లోని తిరువనంతపురం Thiruvananthapuram లో బీజేపీ BJP మేయర్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ Prime Minister Modi హాజరయ్యారని, అలాగే ముంబయి మేయర్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఇందూరులోనూ బీజేపీకి మేయర్ పీఠం అప్పజెప్పితే ప్రధాని మోదీ వస్తారని తెలిపారు.
నిజామాబాద్ పేరును కచ్చితంగా ఇందూరుగా మార్చే బాధ్యత బీజేపీదేనని అన్నారు. మాట ఇస్తే తప్పే పార్టీ తమది కాదన్నారు. కార్యక్రమంలో ఎంపీ MP అర్వింద్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లి గంగారెడ్డి, ఆయా డివిజన్ బీజేపీ అభ్యర్థులు నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.