అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Arvind | ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ (MP Arvind) ధర్మపురి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పార్లమెంట్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి సీపీ రాధాకృష్ణన్ పోటీ చేయగా.. ఇండి కూటమి నుంచి తెలంగాణకు చెందిన సుదర్శన్రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు.