అక్షరటుడే, వెబ్డెస్క్ : Arvind Ukraine Group | పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్గా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి (MP Arvind Dharmapuri) నియమితులయ్యారు. ఈ గ్రూప్ ద్వారా భారత్, ఉక్రెయిన్ దేశాల మధ్య పార్లమెంటరీ (Parliamentary) స్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, అలాగే విద్య, వాణిజ్యం, సాంస్కృతిక రంగాలలో సహకార అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అర్వింద్ టీం లీడర్ గా ఉన్న ఈ గ్రూపులో ఎంపీలు రంజన్ గొగోయ్, లక్ష్మీకాంత్ పప్పు నిషాద్(SP), అమర్ శరద్రావ్ కాలే (NCP-SP), ఖలీలుర్ రహమాన్ (AITC), హనుమాన్ బేనివాల్ (RLP), ప్రభా మల్లికార్జున్ (INC), శివమంగళ్ సింగ్ తోమర్ (BJP), ఐ.ఎస్. ఇన్బదురై (AIADMK), రణదీప్ సింగ్ సుర్జేవాలా (INC), సదానంద్ మ్హాలు తనవాడే (BJP) సభ్యులుగా ఉన్నారు.
ఈ బాధ్యతలు అప్పగించినందుకు ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రి కిరణ్ రిజిజులకు ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు. కాగా తెలంగాణ నుంచి కువైట్ టీం లీడర్గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఒమన్ టీం లీడర్గా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎంపికయ్యారు.
