Homeజిల్లాలునిజామాబాద్​PRTU Telangana | గురునానక్ బోధనలతో ముందుకు సాగాలి

PRTU Telangana | గురునానక్ బోధనలతో ముందుకు సాగాలి

గురునానక్​ బోధనలను ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షుడు కృపాల్​ సింగ్​ పేర్కొన్నారు. కంఠేశ్వర్​ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్​ బుక్కులు అందజేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: PRTU Telangana | గురునానక్ (Guru Nanak) బోధనలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్​సింగ్​ అన్నారు. ఈనెల 5న గురునానక్ జయంతి పురస్కరించుకొని నగరంలోని కంఠేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో (Kanteshwar Primary School) విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పండ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వమత సమానత్వమే మానవత్వమని గురునాన బోధించినట్లు గుర్తు చేశారు. ప్రతిఒక్కరూ కరుణ, దయ, క్షమాగుణం పెంపొందించుకోవాలని, నిరుపేదలకు సేవ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిబాబా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.