ePaper
More
    HomeUncategorizedKamareddy | నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తల్లి ఆత్మహత్య

    Kamareddy | నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తల్లి ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కొడుకును చెరువులో తోసేసి తానూ సూసైడ్ చేసుకుంది.

    కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాచమొల్ల స్రవంతి(24) శుక్రవారం సాయంత్రం ఇంట్లో గొడవ పడి నాలుగేళ్ల కొడుకు రుద్రేష్, ఏడేళ్ల కూతురు శ్రీవల్లితో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. చిన్నమల్లారెడ్డి గ్రామ చెరువు వద్దకు రాగానే కూతురు తప్పించుకుని పారిపోయింది.

    నాలుగేళ్ల కొడుకును చెరువులో తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే రుద్రేష్ బతికే ఉన్నాడన్న ఆశతో జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో వారిద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబంలో గొడవలే ఆత్మహత్యకు కారణమా..? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...