ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష

    Ahmedabad Plane Crash | విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​లో జరిగి ఎయిర్​ ఇండియా విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సమీక్షించారు. కేంద్రమంత్రులు అమిత్‌షా(Union Ministers Amit Shah), రామ్మోహన్‌(Rammohan)కు మోదీ ఫోన్ చేశారు. విమాన ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు గురించి తెలుసుకున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు.ప్రమాదం విషయమై ఇప్పటికే హోం మంత్రి అమిత్​ షా అధికారులతో మాట్లాడారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ ఘటన స్థలానికి చేరుకున్నారు. అమిత్​ షా కూడా అహ్మదాబాద్​ వెళ్లనున్నారు.

    Ahmedabad Plane Crash | విమానంలో 169 మంది భారతీయులు

    ప్రమాద సమయంలో విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు ఉన్నారు. ఏడుగురు పోర్చుగీస్‌ దేశస్థులు, ఒకరు కెనడియన్‌ ఫ్లైట్​లో ప్రయాణిస్తున్నారు. మొత్తం 242 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

    Ahmedabad Plane Crash | 110 మంది మృతి!

    విమాన ప్రమాదంలో ఇప్పటికే 110 మంది మృతి చెందినట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సహాయక బృందాలు ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంతో సాయంత్రం 5 గంటల వరకు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌(Ahmedabad Airport) మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

    Ahmedabad Plane Crash | బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

    ఎయిర్​ ఇండియా విమానం కూలిపోవడంపై టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్(Tata Sons Chairman N Chandrasekaran)​ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన.. బాధితులకు అండగా ఉంటామన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...