Homeఅంతర్జాతీయంPM Modi | ట్రంప్​పై మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

PM Modi | ట్రంప్​పై మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ట్రంప్​ గాజాలో శాంతి స్థాపనకు ఇటీవల ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. హమాస్​, ఇజ్రాయెల్​ మధ్య రెండేళ్లుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ యుద్ధంతో లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ క్రమంలో గాజా(Gaza)లో శాంతిస్థాపనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump)​ రంగంలోకి దిగారు. ఈ మేరకు 20 పాయింట్ల ప్రణాళికను ఆయన ముందుకు తీసుకొచ్చారు. దీనిని ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఈ ప్రణాళిక మేరకు బందీలను విడుదల చేసేందుకు హమాస్​ సైతం ముందుకు వచ్చింది. దీంతో ప్రధాని మోదీ(PM Modi) ట్రంప్​ చర్యలను సమర్థిస్తూ ఎక్స్​ వేదికగా పోస్ట్​ పెట్టారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను ఆయన అభినందించారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.

PM Modi | ట్రంప్​ బెదిరించడంతో..

ట్రంప్​ ప్రతిపాదనను ఇజ్రాయెల్​ అంగీకరించినా మొదట హమాస్(Hamas)​ ఒకే చెప్పలేదు. దీంతో ట్రంప్​ హమాస్​ను హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం లోపు ప్రణాళికను అంగీరించకపోతే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో హమాస్​ నాయకులు దిగొచ్చారు. ఈ మేరకు ప్రణాళికలోని కొన్ని పాయింట్లను అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్​ బందీలను ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు.

కాగా 2023 అక్టోబర్​ 7 హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌(Israel)పై దాడి చేసి 250 మందికి పైగా పౌరులను బందీలుగా తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్​ హమాస్​పై ప్రతిదాడులు చేపట్టింది. అప్పటి నుంచి యుద్ధం సాగుతూనే ఉంది. అయితే గతంలో హమాస్​ పలువురు బందీలను విడుదల చేసింది. తాజాగా మొత్తం బందీలను విడుదల చేయడానికి ఒప్పుకుంది. అలాగే గాజా పరిపాలనను సైతం పాలస్తీనా టెక్నోక్రాట్స్‌కి అప్పగించేందుకు హమాస్​ సిద్ధం అవుతోంది.