Homeక్రీడలుKhelo India | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ ప్రారంభించిన మోదీ

Khelo India | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ ప్రారంభించిన మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khelo India | ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​ను ప్రధాని నరేంద్ర మోదీ PM Modi ఆదివారం ప్రారంభించారు. బీహార్​ bihar వేదికగా సాగుతున్న ఈ క్రీడలను వర్చువల్​గా ఆరంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. అథ్లెట్లకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. 2036 ఒలింపిక్స్ olympics​ దేశంలో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ఐపీఎల్ IPL​లో సెంచరీతో చెలరేగిన యువ క్రికెటర్​ వైభవ్​ సూర్యవంశీని మోదీ ప్రశంసించారు.

ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 27 ఈవెంట్లలో 6 వేల మంది క్రీడాకారులు పోటీలో ఉండనున్నారు. ఈసారి బీహార్‌లోని ఐదు నగరాలు, న్యూఢిల్లీలో పోటీలు నిర్వహించున్నారు. నేటి నుంచి ఈ గేమ్స్​ మే 15 వరకు కొనసాగుతాయి.