HomeUncategorizedPrime Minister Modi | అభివృద్ధి ఒక్క‌టే గెలిపించ‌దు.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని ఎంపీల‌కు మోదీ...

Prime Minister Modi | అభివృద్ధి ఒక్క‌టే గెలిపించ‌దు.. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని ఎంపీల‌కు మోదీ హిత‌వు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Prime Minister Modi | సోషల్ మీడియాలో చురుగ్గా లేని బీజేపీ ఎంపీ(BJP MP)ల తీరుపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అభివృద్ధి మాత్ర‌మే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి పెట్ట‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఎంపీలు ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని హితవు ప‌లికారు.

ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో మ‌రింత చురుగ్గా ఉండాల‌ని సూచించారు. రెండ్రోజులుగా జ‌రుగుతున్న బీజేపీ ఎంపీల వ‌ర్క్‌షాప్ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో చురుగ్గా లేని ఎంపీల పేర్ల‌తో బీజేపీ జాబితా సిద్ధం చేసింది. ఈ జాబితాపై వ‌ర్క్‌షాప్‌లో చ‌ర్చించారు. ఎంపీల ప‌నితీరు, కీలకమైన జాతీయ అంశాలపై చర్చ జ‌రిగింది. ఎంపీల సోషల్ మీడియా కార్యకలాపాలపై వ‌ర్క్ షాప్‌లో నివేదించారు. ఈ రిపోర్ట్ కార్డులు సోషల్ మీడియా సైట్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్‌(You Tube)లలో వారి కార్యకలాపాలను ట్రాక్ చేశాయి. ఎంపీలను మూడు వర్గాలుగా విభజించారని బీజేపీ నాయ‌క‌త్వం.. యాక్టివ్, బేర్లీ యాక్టివ్, ఇన్‌ యాక్టివ్ అని విభ‌జించింది.

Prime Minister Modi | మూడు వ‌ర్గాలుగా విభ‌జ‌న‌

జనవరి, ఆగస్టు మధ్య ఎంపీల సోషల్ మీడియా(Social Media) కార్యకలాపాలను ట్రాక్ చేసిన తర్వాత మూడు పేజీల నివేదికను తయారు చేశారు. వివిధ సోషల్ మీడియా సైట్‌లలో వారి కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి అనేక పారామితులు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక నెలలో ఫేస్‌బుక్‌(Face Book)లో పోస్ట్‌లు చేయని ఎంపీలను ‘ఇనాక్టివ్’ అని ట్యాగ్ చేసి రెడ్ మార్క్ వేశారు. నెలలో 0-60 పోస్టులు ఉన్న వాటిని ‘కేవలం యాక్టివ్’ అని ట్యాగ్ చేసి ఎల్లో మార్క్ చేశారు. 60 కంటే ఎక్కువ పోస్టులు ఉన్న వాటిని ‘యాక్టివ్’ అని ట్యాగ్ చేసి గ్రిన్ మార్క్ చేశారు.

Prime Minister Modi | యాక్టివ్‌గా ఉండాలి..

వర్క్‌షాప్ సందర్భంగా ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎంపీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివిటీని పెంచుకోవాలని చెప్పారు. ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి, వారితో నిమగ్నమవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్(Instagram) వంటి ప్లాట్‌ఫామ్‌లను చురుకుగా ఉపయోగించాలని ఎంపీల‌కు ఆయన సూచించారు. ఎన్నికల్లో గెలవడానికి అభివృద్ధి సరిపోదని, ప్రజలతో నిమగ్నమై కనెక్ట్ అవ్వడమే ముఖ్యమ‌ని ఆయన సలహా ఇచ్చారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రజలకు చేరువ కావడానికి సోషల్ మీడియాను ఎలా ఉపయోగించవచ్చో బీజేపీ ఎంపీ తేజస్వి(BJP MP Tejaswi) సూర్య వర్క్‌షాప్‌లో, ప్రెజెంటేషన్ ఇచ్చారు.