HomeతెలంగాణMLA Arikepudi Gandhi | హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. కూల్చివేతల అడ్డగింత

MLA Arikepudi Gandhi | హైడ్రాపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. కూల్చివేతల అడ్డగింత

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLA Arikepudi Gandhi | హైదరాబాద్​ నగరంలోని మాదాపూర్​(Madhapur)లో గల సున్నం చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ చెరువులో కలుషిత జలలాతో ప్రజారోగ్యానికి ముంపు పొంచి ఉందని ఇటీవల హైడ్రా(Hydraa) పేర్కొంది. చెరువులో ఆక్రమణలు తొలగించి.. మంచినీటితో నింపుతామని అధికారులు అన్నారు. ఈ క్రమంలో సోమవారం హైడ్రా సిబ్బంది సున్నం చెరువు బఫర్​ జోన్​లో నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు. అయితే కూల్చివేతలను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi Gandhi) అడ్డుకున్నారు.

MLA Arikepudi Gandhi | నిబంధనలకు విరుద్ధంగా హైడ్రా తీరు

హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. సున్నం చెరువు(Lime pond) వద్దకు చేరుకొని ఆయన కూల్చివేతలను అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బఫర్​ జోన్​ హద్దులు నిర్ణయించకుండా కూల్చివేతలు ఎలా చేపడతారని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి చెరువులు కబ్జాకు గురికాకుండా అభివృద్ధి చేయాలని హైడ్రాను ఏర్పాటు చేశారన్నారు. కానీ హైడ్రా అధికారులు(Hydra Officers) మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా తీరుతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. కాగా అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి ఎమ్మెల్యేగా బీఆర్​ఎస్​ నుంచి గెలుపొందారు. అనంతరం ఆయన కాంగ్రెస్​లో చేరారు.

MLA Arikepudi Gandhi | ఉద్రిక్తతల నడుమ కూల్చివేతలు

సున్నం చెరువులో హైడ్రా అధికారులు ఉద్రిక్తతల నడుమ కూల్చివేతలు కొనసాగించారు. ఎమ్మెల్యే అడ్డుకున్నా.. స్థానికులు జేసీబీలకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపినా కూల్చివేతలు చేపట్టడం గమనార్హం. భారీ బందోబస్తు మధ్య అధికారులు చెరువు బఫర్​ జోన్​లోని నిర్మాణాలను కూల్చివేశారు.