Mla Sudharshan reddy
Mla Sudharshan reddy | మున్సిపల్​ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

అక్షరటుడే, బోధన్: Mla Sudharshan reddy | మూడురోజులుగా వర్షాలు కురుస్తున్నందున మున్సిపల్​ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని షర్బత్​ కెనాల్(Sharbath Canal)​, సరస్వతినగర్ (Saraswati Nagar)​, హనుమాన్​ టేక్డి (Hanuman Tekdi) తదితర ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. అనంతరం బోధన్​ ఆస్పత్రిని (Bodhan Government Hospital) సందర్శించారు. వర్షం కారణంగా రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Mla Sudharshan reddy | మున్సిపల్​ అధికారులతో సమీక్ష

ఆస్పత్రిని సందర్శించిన అనంతరం మున్సిపాలిటీలో అధికారులకు సమీక్ష నిర్వహించారు. వరుసగా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాలు జలమయ్యే అవకాశాలుంటాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉన్నవారికి ముందుజాగ్రత్తగా హెచ్చరికలు జారీచేయాలని పేర్కొన్నారు. మున్సిపల్​ యంత్రాంగం అలర్ట్​గా ఉండాల్సిన సమయమని చెప్పారు.