Bhiknoor congress
Bhiknoor congress | ఎమ్మెల్యే పాడి కౌషిక్​రెడ్డి దిష్టిబొమ్మ దహనం

అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor congress | సీఎం రేవంత్​రెడ్డిపై (CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని భిక్కనూరు కాంగ్రెస్ (Bhiknoor congress)​ నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హుజూరాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy) దిష్టిబొమ్మను దహనం చేశారు.

అనంతరం వారు ర్యాలీగా వెళ్లి భిక్కనూరు పోలీస్​స్టేషన్​కు వెళ్లి (Bhiknoor police Station) ఎస్సైకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్​రెడ్డి (PCC Secretary Indrakaran Reddy), గ్రంథాలయ ఛైర్మన్​ చంద్రకాంత్​రెడ్డి, బ్లాక్​ కాంగ్రెస్​ నేతలు బల్యాల సుదర్శన్​, నేతలు అంకంరాజు, నరేందర్​రెడ్డి, నాగరాజు, శ్రీరాం, వెంకటేష్​, మైపాల్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డిపై ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్​ నాయకులు