ePaper
More
    Homeఅంతర్జాతీయంMiss World | బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు

    Miss World | బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Miss World : మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయా దేశాల 22 మంది సుందరీమణులు నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ కు చేరుకున్నారు. ఇక్కడి బుద్ధవనంలో పర్యటించారు. గిరిజన, జానపద నృత్య కళాకారులు వారికి ఘనస్వాగతం పలికారు.

    ఇక్కడి పరిసరాలను చూసి సుందరీమణులు సంతోషం వ్యక్తం చేశారు. బౌద్ధ థీమ్‌పార్క్‌లోని బుద్ధ విగ్రహాల ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

    అంతకుముందు తెలంగాణ పర్యాటక సంస్థ విజయ్‌ విహార్‌(Telangana Tourism Organization Vijay Vihar)లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం సుందరీమణులంతా ఫొటోషూట్‌లో సందడి చేశారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా వీరు బుద్ధవనం పర్యటనకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.

    బుద్ధవనానికి వచ్చిన వారిలో ఇండియా, ఫిలిప్పీన్స్‌, శ్రీలంక, సింగపూర్‌, కంబోడియా, మయన్మార్‌, నేపాల్‌, వియత్నాం, జపాన్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, లెబనాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇండోనేసియా, మంగోలియా, తుర్కియే, చైనా, థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌, ఆర్మేనియా దేశాల సుందరీమణులు ఉన్నారు.

    More like this

    IAS Transfers | ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ బదిలీలు.. కీలక నియామకాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌లను బదిలీ(IAS Transfers) చేసిన విష‌యం...

    Ilaiyaraaja | అమ్మ‌వారికి ఏకంగా రూ.4 కోట్ల విలువైన కానుకలు సమ‌ర్పించిన పాపుల‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ilaiyaraaja | ప్రఖ్యాత సంగీత దర్శకుడు, మాస్ట్రో ఇళయరాజా గురువారం (సెప్టెంబర్ 11) కర్ణాటక...

    America | భారత్‌ను చైనాకు దూరం చేయడమే మా ప్రాధాన్యం.. అమెరికా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | సుంకాలతో భారత్​ను భయపెట్టాలని చూసిన అమెరికా వెనక్కి తగ్గింది. భారత దౌత్య...