అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipality | మినీట్యాంక్ బండ్ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్కు మున్సిపల్ ఛైర్మన్ రాజు సూచించారు. మంగళవారం పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.4 కోట్ల టీయూఎఫ్డీసీ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యం జరగవద్దని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్ పాల్గొన్నారు.
