HomeతెలంగాణPaddy Bonus | సన్నాలకు బోనస్​పై మంత్రి ఉత్తమ్​ కీలక ప్రకటన

Paddy Bonus | సన్నాలకు బోనస్​పై మంత్రి ఉత్తమ్​ కీలక ప్రకటన

Paddy Bonus | ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సన్నాలకు మద్దతు ధరతో పాటు బోనస్​ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Bonus | వానాకాలం సీజన్​కు సంబంధించి ధాన్యం (Paddy) కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్​ కుమార్​రెడ్డి (Uttam Kumar Reddy), తుమ్మల నాగేశ్వర్​ రావు (Tummala Nageswara Rao) జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సన్నాలకు బోనస్​పై కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలో సన్నరకం వరి సాగు చేసిన రైతులకు క్వింటాల్​కు రూ.500 బోనస్​ ఇస్తామని గతంలో కాంగ్రెస్​ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత వానాకాలం సీజన్​లో రైతులకు బోనస్​ డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. మొదట మద్దతు ధర ఖాతాల్లో వేసిన ప్రభుత్వం, అనంతరం బోనస్​ చెల్లించింది. అయితే యాసంగి బోనస్ మాత్రం ​ఇంకా ఇవ్వలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులు (Farmers) బోనస్​ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సమీక్షలో మంత్రి ఉత్తమ్​ మాట్లాడుతూ.. మద్దతు ధరతో పాటు బోనస్​ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. వానాకాలం సీజన్​కు సంబంధించి బోనస్​ చెల్లిస్తామన్నారు. అయితే యాసంగి సంగతి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Paddy Bonus | రైతులకు సౌకర్యాలు కల్పించాలి

ధాన్యం దిగుబడిలో తెలంగాణలో రికార్డు సృష్టించిదని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్​లో 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలన్నారు. ధాన్యం తూకం వేసిన వెంటనే లారీల్లో మిల్లులకు తరలించాలన్నారు. ఈ మేరకు అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 48 నుంచి 72 గంటల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తితే 1967, 1800–425–00333 నంబర్లకు ఫోన్​ చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.