అక్షరటుడే, వెబ్డెస్క్ : Jubilee Hills | హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై (By-election) మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మాజీ ఎంపీ అజారుద్దీన్తో కలిసి మాట్లాడారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తామని తెలిపారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఇతర నియోజకవర్గాల నేతలకు ఇక్కడ ఛాన్స్ లేదని స్పష్టం చేశారు.
Jubilee Hills | వారికే అవకాశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానికంగా పని చేస్తున్న వారికే టికెట్ వస్తుందని పొన్నం తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజలతో ఉన్న వారికే టికెట్ దక్కుతుందన్నారు. అయితే అది ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. బయటి నియోజకవర్గాలకు చెందిన టికెట్ ఆశిస్తున్నా.. ఇక్కడ అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Jubilee Hills | కాంగ్రెస్ను గెలిపించాలి
టికెట్ ఆశిస్తున్న నేతలు స్థానికంగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని పొన్నం సూచించారు. ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)ను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తమ పార్టీ కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు. గత పదేళ్లుగా పట్టించుకొని సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
Jubilee Hills | మాగంటి మృతితో..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) అనారోగ్యంతో మృతి చెందారు. జూన్ 8న ఆయన చనిపోయారు. ఈ క్రమంలో ఆరు నెలలోపు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఆ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కార్యాచరణ అమలు చేస్తోంది. చాలా మంది ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో పొన్నం వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Jubilee Hills | పోటీకి సై అంటున్న అజారుద్దీన్
మాజీ ఎంపీ అజారుద్దీన్ (Azharuddin) జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పోటీ చేస్తారనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. కాగా అజారుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి గోపినాథ్కు 80,175 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్కు 63,838 ఓట్లు వచ్చాయి. ఓడిపోయినా.. తాను నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని అజారుద్దీన్ పేర్కొంటున్నారు. తనకే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.