HomeతెలంగాణPCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు మాకే.. పీసీసీ చీఫ్​...

PCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్​ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు మాకే.. పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్​కే మద్దతు ఇస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : PCC Chief Mahesh Goud | జూబ్లీహిల్స్ (Jubilee Hills)​ ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ స్థానంలో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్​ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఇంఛార్జీ మంత్రులు, 18 మంది కార్పొరేషన్​ ఛైర్మన్​లకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది.

ఉప ఎన్నికలపై తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం (MIM) తమ ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికల్లో వారి మద్దతు కాంగ్రెస్​కే ఉంటుందని చెప్పారు. త్వరలో తమ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

PCC Chief Mahesh Goud | ఏ శక్తి ఆపలేదు

జూబ్లీహిల్స్​లో తప్పుకుండా గెలిచి తీరుతామని మహేశ్​ గౌడ్​ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు.

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టివేయడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ గౌడ్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. ఎలాగైనా రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.