అక్షరటుడే, ఇందూరు: Bakrid | నగరంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని మున్సిపల్ కార్పొరేషన్ తరపున సౌకర్యాలు కల్పించాలని ఎంఐఎం (MIM Nizamabad) నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్కు (Corporation Commissioner Dilip Kumar) వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ సందర్భంగా పారిశుధ్యలోపం తలెత్తకుండా చూడాలని విన్నవించారు. వచ్చే నెలలో నగరంలోని జోన్–3, 4, 5 పరిధిలో ప్రత్యేక మున్సిపల్ వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు. డ్రెయినేజీ సమస్యలు రాకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ను కలిసిన వారిలో ఎంఐఎం జిల్లాధ్యక్షుడు ఫయాజ్ తదితరులున్నారు.