MIM Nizamabad
MIM Nizamabad | సీపీని కలిసిన ఎంఐఎం నాయకులు

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: MIM Nizamabad | వచ్చే నెలలో జరుగనున్న బక్రీద్​ పండుగకు సౌకర్యాలు కల్పించాలని ఎంఐఎం నాయకులు కోరారు. సోమవారం సీపీ సాయి చైతన్యను కలిసి (CP Sai Chaitanya) పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ బక్రీద్​ పండుగకు (Bakrid festival) సంబంధించి పోలీస్​శాఖ తరపున టోల్​ఫ్రీ నంబర్ (Toll-free number)​ ఏర్పాటు చేయాలని విన్నవించారు. తద్వరా పండుగకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు మైనార్టీలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేలా సహకరించాలని కోరారు. సీపీని కలిసిన వారిలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్​ తదితరులు ఉన్నారు.