Midday meal
Midday meal | మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాలి

అక్షరటుడే, ఇందూరు: Midday meal | ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలని ప్రజా సంఘాల నాయకులు ఆల్గోట్ రవీందర్, నర్రా రామారావు (Narra ramarao) డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్​లో (Dharna Chowk) కొనసాగుతున్న దీక్షకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని చెబుతున్నా.. ఛార్జీలు మాత్రం పెంచడం లేదన్నారు. అలాగే వంట కార్మికుల వేతనాలు కూడా ప్రభుత్వం పెంచాలని డిమాండ్​ చేశారు. కార్మికులకు ఇన్సూరెన్స్ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ (AITUC) ప్రధాన కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (Mid-day meal scheme workers union) గౌరవాధ్యక్షుడు సాయమ్మ, నాగలక్ష్మి, వనజ, గంగామణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.