HomeతెలంగాణRangareddy | మల్బరీ సాగును పరిశీలించిన వ్యవసాయ కమిషన్​ సభ్యులు

Rangareddy | మల్బరీ సాగును పరిశీలించిన వ్యవసాయ కమిషన్​ సభ్యులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rangareddy | రంగారెడ్డి(Rangareddy) జిల్లా యాచారం మండలం చౌదరిపల్లి గ్రామంలో రైతు కమిషన్ సభ్యులు (Members of Farmers’ Commission) శుక్రవారం పర్యటించారు. ఆదర్శ రైతు కాశమల్ల వెంకట్రాములు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు.

ఛైర్మన్​ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, మెంబర్ సెక్రెటరీ గోవింద్​ తదితరులు పాల్గొన్నారు. మల్లేశ్​ పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నాడు. మల్బరీ సాగు ద్వారా ఎలాంటి లాభాలున్నాయని ఆరా తీశారు. పట్టు పురుగుల పెంపకం గురించి తెలుసుకున్నారు.