అక్షర టుడే, బాల్కొండ: Medical Camp | మండలంలోని కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మెగా వైద్య శిబిరం (mega medical camp) నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ పథకం (central government scheme) స్వస్థ నారి – సశక్త పరివార్ అభియాన్ లో భాగంగా వైద్యులు దాదాపు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి ఉచితంగా మందులు అందించినట్లు ప్రత్యేక అధికారి డాక్టర్ స్రవంతి తెలిపారు. కార్యక్రమంలో వైద్య యశ్వంత్, హరి కుమార్ గౌడ్, సతీష్ కుమార్, ఇందు, కీర్తి ప్రియా, చిదుర, అక్షయ్, కీర్తన్ విజయ్, అమరదీపిక, సాగర్, రాజేందర్ తోపాటు సిబ్బంది మేరమ్మ, పరమేశ్వర్, వీరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.