Meenakshi Natarajan
Meenakshi Natarajan | శ్రమదానం చేసిన మీనాక్షి నటరాజన్

అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | ప్రజాహిత పాదయాత్రలో (Prajahitha padayatra) భాగంగా రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​ ఆర్మూర్​లో పర్యటిస్తున్నారు.

పట్టణానికి శనివారం చేరుకున్న ఆమె కార్యకర్తలతో కలిసి జెండా గల్లీ, గోల్​బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం రాత్రి సీ కన్వెన్షన్​ హాల్​లో బస చేశారు. కాగా.. ఆదివారం ఆలూరు జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆమె కార్యకర్తలతో కలిసి శ్రమదానం నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు.

కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (manala Mohan reddy), నిజామాబాద్ ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Seethakka), మాజీ ఎంపీ మధుయాష్కీ (madhu yashki), ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat), ఆర్మూర్, బాల్కొండ ఇన్​ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్, కాంగ్రెస్ ఆలూరు మండలాధ్యక్షుడు ముక్కెర విజయ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.