Meenakshi Natarajan | రేపు ఆర్మూర్​లో మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర
Meenakshi Natarajan | రేపు ఆర్మూర్​లో మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

అక్షరటుడే ఆర్మూర్: Meenakshi Natarajan | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర (Janahitha Padayatra) శనివారం ఆర్మూర్​కు (Armoor) చేరుకోనుంది. నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమై గగ్గుపల్లి (gaggupally), ఇస్సాపల్లి గ్రామాల మీదుగా ఆర్మూర్ పట్టణానికి చేరుకుంటుంది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగనుంది. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలపై వినతులను ఆమె స్వీకరించనున్నారు.

Meenakshi Natarajan | ఆర్మూర్​లోనే బస..

పాదయాత్ర అనంతరం పట్టణంలోని జర్నలిస్ట్​ కాలనీలోని సీ కన్వెన్షన్ హాల్​లో మీనాక్షి నటరాజన్ బస చేయనున్నారు. ఆదివారం ఉదయం పట్టణంలో హౌసింగ్​ బోర్డు కాలనీలో గల గురుకుల కళాశాలలో శ్రమదానం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆర్మూర్ పట్టణ శివారులోని యమునా ఫంక్షన్ హాల్​లో జరిగే ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె పాల్గొంటారు.

Meenakshi Natarajan | హాజరుకానున్న ముఖ్య నాయకులు..

ఆర్మూర్​లో జరిగే పాదయాత్రకు కాంగ్రెస్ ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. పీసీసీ చీఫ్ (PCC Chief) మహేష్ కుమార్ గౌడ్​తో పాటు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (Incharge Minister Seethakka), ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, ఆర్మూర్​, బాల్కొండ నియోజవర్గ ఇన్​ఛార్జీలు వినయ్ రెడ్డి, సునీల్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు నాయకులు పాల్గొననున్నారు.

Meenakshi Natarajan | శ్రమదానం స్థల పరిశీలన. ..

పట్టణంలోని పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలోశ్రమదాన స్థలాన్ని శుక్రవారం కాంగ్రెస్​ నాయకులు పరిశీలించారు. వనమహోత్సవంలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ మొక్కలు నాటనున్నందున పరిసరాలను పరిశీలించినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్ రాజు, కాంగ్రెస్ నేతలతో కలిసి పరిశీలించారు.

మీనాక్షి నటరాజన్​ శ్రమదానం చేయనున్న ప్రాంతాన్ని పరిశీలిస్తున్న వినయ్​రెడ్డి తదితరులు