అక్షరటుడే, హైదరాబాద్: Medha School drug case | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్ కేసులు భాగ్యనగరానికి మాయని మచ్చగా పరిణమిస్తున్నాయి.
బార్లు Bars, పబ్లు pubs, రెస్టారెంట్లు restaurants, ప్రైవేటు యూనివర్సిటీలు universities.. ఇలా ఎక్కడ చూసినా డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా ఉంటోంది.
బోయిన్పల్లి Boinpally లోని మేధా స్కూల్ Medha School లో డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు రైడ్ చేయగా 7 కిలోల డ్రగ్స్ దొరికింది. దీంతోపాటు రూ.20 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూం నంబరు 6 తో పాటు మరో రెండు గదుల్లో డ్రగ్స్ Drug తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గదులను డైరెక్టర్ ఎప్పుడు కూడా మూసి ఉంచేవాడని విచారణలో తేలింది.
130 మంది పిల్లలు ఉండే పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేయడం స్థానికులను షాక్కు గురిచేసింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పాఠశాలలోని కెమిస్ట్రీ ల్యాబ్లో 8 రియాక్టర్లు, 8 డ్రైయర్లు పెట్టి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం నుంచి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేసే సదరు డైరెక్టర్ / ప్రిన్సిపల్.. తాను తయారు చేసిన ప్రొడక్ట్ను. ఆదివారం డెలివరీ చేసేవాడు.
Medha School drug case | నిందితుల అరెస్టు..
గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి జయప్రకాష్ గౌడ్ ఫార్ములా కొని అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా, గురువారెడ్డి పరారీలో ఉన్నాడు. అతగాడి కోసం ఈగల్ టీమ్ గాలిస్తోంది.
బోయిన్పల్లిలోని మేధా పాఠశాలను అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, బోయిన్పల్లి మేధా స్కూల్కు తల్లిదండ్రులు చేరుకున్నారు. స్కూల్ సీజ్ చేయడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ఎగ్జామ్ ఉందని నిన్న మెసేజ్ వచ్చిందని పేరెంట్స్ తెలిపారు. అందుకే పిల్లలను స్కూల్కు తీసుకొచ్చామని పేర్కొన్నారు. స్కూల్ సీజ్ చేసిన విషయం తమకు తెలియదని తల్లిదండ్రులు వాపోయారు.