Homeజిల్లాలునిజామాబాద్​CP Sai chaitanya | ఐరాడ్, ఈడార్​ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: సీపీ...

CP Sai chaitanya | ఐరాడ్, ఈడార్​ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: సీపీ సాయిచైతన్య

రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నరీతిలో ముందుకెళ్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: CP Sai chaitanya | ఐరాడ్, ఈడార్​లను విజయవంతంగా నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) వెల్లడించారు. నిజామాబాద్​ను మోడల్ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

మన తెలంగాణ రాష్ట్రంలో ఐరాడ్, ఈడార్ ప్రాజెక్టును (IRAD and EDAR project) నిజామాబాద్ జిల్లాలో జులై 2021 నుండి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహణ, శిక్షణ, సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో పోలీస్ శాఖ (Police Department), రవాణా శాఖ (Transport Department), ఆరోగ్య శాఖ (Health Department), రహదారుల శాఖల సమస్వయంతో పనిచేస్తాయని తెలిపారు.

CP Sai chaitanya | వినూత్నరీతిలో ప్రచారం..

అవగాహన కార్యక్రమాలే కాకుండా వినూత్న రీతుల్లో ముందుకెళ్తూ ఆర్మూర్ జక్రాన్​పల్లి, ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ (Nizamabad Rural Police Stations) పరిధిలలో ప్రమాదాల నివారణకు డమ్మీ రోడ్డు ప్రమాద ప్రదర్శనను నిర్వహించినట్లు సీపీ చెప్పారు. ఈ ప్రాజెక్టులో నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు కూడా మొదలు పెట్టినప్పటికీ.. ఇందూరు జిల్లా ప్రగతిపథంలో దూసుకెళ్తుందని సీపీ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలను (government departments) ఈ ప్రాజెక్టుకు అనుసంధానం చేశామన్నారు. దీని వల్ల ప్రప్రథమంగా ఐరాడ్, ఈడార్ అప్లికేషన్ ఉపయోగించి, అత్యధిక ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించామని ఆయన తెలిపారు.

CP Sai chaitanya | రోడ్డుప్రమాదాలు జరగకుండా అవగాహన..

పోలీస్​ కమిషనరేట్​ (Police Commissionerate) పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా.. దాదాపు 200 కన్నా ఎక్కువ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని సీపీ తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో 2021 నుండి ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.