More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | ఎండీఎం కార్మికుల బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలి

    Banswada | ఎండీఎం కార్మికుల బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | ఎండీఎం కార్మికుల బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుబాస్ రాములు (AITUC District Working President Dubas Ramulu) డిమాండ్ చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం (Banswada Sub-Collector office) ముందు మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం రెండో రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్​లో ఉన్న మొత్తం బిల్లులు కార్మికులకు చెల్లించాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు (mid-day meal workers) రూ.పది వేలు గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం హామీని మరిచిపోయిందని ఆయన దుయ్యబట్టారు. శిథిలావస్థలో ఉన్న వంటశాలలను నిర్మించాలని, వంట పాత్రలు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బాన్సువాడ డివిజన్ సెక్రెటరీ శంకర్, అంజవ్వ, సుజాత, నాగమణి, లక్ష్మి, నజిమాబి, చియా బేగం, సోఫియా బేగం, మంద శంకర్​, సాయిలు, పాషా తదితరులు పాల్గొన్నారు.

    More like this

    TTD | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. డిసెంబర్​ దర్శన కోటా టికెట్ల విడుదల ఎప్పుడంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TTD | శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూసే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన...

    Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా మినీ ట్యాంక్ బండ్‌ను తీర్చిదిద్దాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | పర్యాటకులను ఆకర్షించేలా నగరంలోని ఖిల్లా రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్​ను...

    ACB Raids | బాత్​రూంలో రూ.20 లక్షలు.. ఏడీఈ బినామీల ఇళ్లలో కొనసాగుతున్న సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌లో గల టీజీఎన్​పీడీసీఎల్​ (TGNPDCL)లో సహాయక డివిజనల్ ఇంజినీరు...