అక్షరటుడే, ఇందూరు: Mayor Election | నిజామాబాద్ జిల్లాలోని నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికతోపాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ అధ్యక్షుల ఎన్నికలను సోమవారం (ఫిబ్రవరి 16) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ TPCC President MLC Mahesh Kumar Goud, ఇన్ఛార్జి మంత్రి సీతక్క In-charge Minister Seethakka, పార్లమెంటరీ ఇన్ఛార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి Parliamentary In-charge Uttam Kumar Reddy రాబోతున్నారు.
నిజామాబాద్ నగర పాలక సంస్థలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను సోమవారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ మున్నిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) భవనాన్ని ముస్తాబు చేశారు. మేయర్ ఛాంబర్, సమావేశం గదిని తీర్చిదిద్దారు. కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ ఆధ్వర్యంలో పనులు పూర్తయ్యాయి.
Mayor Election | మొత్తం 60 డివిజన్లు..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ (Nizamabad BJP) 28 డివిజన్లను కైవసం చేసుకుని ఆధిక్యంలో నిలిచింది. అధికార కాంగ్రెస్పార్టీ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు దక్కించుకున్నాయి. ఒక స్థానంలో బీఆర్ఎస్ గెలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్కు బీజేపీ దూరం కావడంతో తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ (Congress Nizamabad), ఎంఐఎం(AIMIM Nizamabad) కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఇప్పటికే నిర్ణయించాయి. ఆ అదృష్ట వంతులు ఎవరనేది రేపు తేలనుంది. కాగా, నగర రాజకీయాల్లో కీలకంగా మారిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల దృష్ట్యా పీసీసీ చీఫ్, మంత్రుల పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.