Homeక్రైంDelhi Encounter | ఢిల్లీలో భారీ ఎన్​కౌంటర్​.. నలుగురు సిగ్మా గ్యాంగ్​ సభ్యుల హతం

Delhi Encounter | ఢిల్లీలో భారీ ఎన్​కౌంటర్​.. నలుగురు సిగ్మా గ్యాంగ్​ సభ్యుల హతం

Delhi Encounter | ఢిల్లీలో భారీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. బీహార్​కు చెందిన నలుగురు సిగ్మా గ్యాంగ్​ సభ్యులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Encounter | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న సిగ్మా గ్యాంగ్ (Sigma Gang)​ సభ్యులు నలుగురు మృతి చెందారు.

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో బీహార్‌ (Bihar)కు చెందిన నలుగురు సిగ్మా గ్యాంగ్ సభ్యులు హతమయ్యారు. ఈ గ్యాంగ్​ కొంతకాలంగా బీహర్‌లో నేరాలకు పాల్పడుతోంది. గ్యాంగ్ కీలక సభ్యుడు రంజన్ పాఠక్‌ (25)తో పాటు సభ్యులు బిమ్లేష్ మహతో (25), మనీష్ పాఠక్ (33) అమన్ ఠాకూర్ (21) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్- బీహార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టి నిందితులను ఎన్​కౌంటర్​ చేశారు. వీరిలో అమన్ ఠాకూర్ ఢిల్లీలోని కార్వాల్ నగర్ నివాసి కాగా, మిగిలిన వారు బీహార్‌లోని సీతామర్హికి చెందినవారు.

Delhi Encounter | కాల్పులు జరపడంతో..

ఈ గ్యాంగ్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక పెద్ద నేర కార్యకలాపాలకు ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు రోహిణిలో వారిని పట్టుకోవడానికి వల పన్నారు. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్లు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు నిందితులు చనిపోయారు. బీహార్​లోని హై ప్రొఫైల్ కేసుల్లో వీరు మోస్ట్​ వాంటెడ్​ అని పోలీసులు తెలిపారు. ముఠాకు కీలక సూత్రధారి అయిన రంజన్ పాఠక్ బీహార్, పరిసర రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో వ్యవస్థీకృత క్రిమినల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Delhi Encounter | కిరాయి హంతకులు

బీహార్​లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్న నేపథ్యంలో గ్యాంగస్టర్లు ఎన్​కౌంటర్ కావడం గమనార్హం. దీనిపై బిహార్‌ డీజీపీ వినయ్‌ కుమార్‌ స్పందిస్తూ.. వారు కిరాయి హంతకులని తెలిపారు. ఈ గ్యాంగ్​ సిగ్మా అండ్​ కంపెనీ పేరుతో నెలకోసారి నేరాలు చేస్తుంటారని చెప్పారు. బీహార్​ ఎన్నికలలో వీరి కుట్రలను భగ్నం చేశామని ఆయన పేర్కొన్నారు.