HomeUncategorizedEncounter | ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​.. 20 మంది మావోల మృతి

Encounter | ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​.. 20 మంది మావోల మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్​గఢ్​ (Chhattisgarh)లోని బీజాపూర్​ జిల్లాలో సోమవారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు maoists మృతి చెందారు. 11 మంది మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్తం పూర్తి చేశారు. కాగా మావోయిస్టులను లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్​ కగార్ operation kagar​ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బలగాలు అడవులను జల్లెడ పడుతూ మావోల పని పడుతున్నాయి.

Encounter | ఆపరేషన్​ కర్రెగుట్టలకు బ్రేక్​

తెలంగాణ – ఛత్తీస్​గఢ్​​ సరిహద్దు Telangana-Chhattisgarh borderలోని కర్రెగుట్టలో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆపరేషన్​ కర్రెగుట్టలు చేపట్టాయి. భారీ సంఖ్యలో బలగాలు గుట్టలను చుట్టముట్టిన బలగాలు కర్రెగుట్టలపై పట్టు సాధించాయి. ఈ క్రమంలో ఎన్​కౌంటర్లు చోటు చేసుకొని పలువురు మావోయిస్టులు మృతి చెందారు. బలగాలు పలు గుట్టలను స్వాధీనం చేసుకున్నాయి.

బేస్​క్యాంపుల ఏర్పాటు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే పాకిస్తాన్​తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆపరేషన్​ కర్రెగుట్టలను నిలిపి వేసింది. బలగాలను వెనక్కి రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కర్రెగుట్టల్లో తుపాకీ మోతలు ఆగిపోయాయి. అయితే బీజాపూర్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో బలగాలు 20 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి.