ePaper
More
    HomeతెలంగాణFormula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన...

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections) వేళ బీఆర్​ఎస్​ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ కారు రేసులో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ (ACB) పేర్కొంది.

    బీఆర్​ఎస్​ హయాంలో హైదరాబాద్​లో ఫార్మూలా ఈ కారు రేస్​ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని ఏసీబీ కేసు నమోదు చేసింది. పలుమార్లు కేటీఆర్ (KTR)​ను సైతం విచారించింది. మంత్రివర్గం ఆమోదం లేకుండా.. కేటీఆర్​ ఇష్టారాజ్యంగా నిధులు కేటాయించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఏసీబీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

    Formula E Race Case | బీఆర్​ఎస్​కు రూ.44 కోట్లు

    ఫార్ములా ఈ కేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్లు ఏసీబీ పేర్కొంది. ఈ-కార్ రేసింగ్‌ కోసం స్పాన్సర్‌షిప్‌ ఇచ్చిన సంస్థ నుంచి ఈ ఫార్ములా ఆపరేషన్స్‌ సంస్థకు రూ.44 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. అనంతరం స్పాన్సర్‌షిప్‌ సంస్థ నుంచి రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్లు బీఆర్ఎస్‌ (BRS) తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఏసీబీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక అందజేసింది.

    Formula E Race Case | అనుమతి ఇవ్వాలని..

    ఈ కేసులో ఏ1గా మాజీమంత్రి కేటీఆర్, ఏ2గా ఐఏఎస్​ అరవింద్‌ కుమార్‌, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిలను ఏసీబీ పేర్కొంది. వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ గవర్నర్​కు నివేదిక పంపింది. దీనికి గవర్నర్​ ఆమోదించారు. దీంతో సీఎం రేవంత్​రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వారిపై ఛార్జి షీట్​ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధంగా ఉంది. అయితే కేటీఆర్​ను అరెస్ట్​ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు కేటీఆర్​ను రెండు సార్లు, అరవింద్​కుమార్​ను మూడు సార్లు ఏసీబీ విచారించింది.

    Formula E Race Case | బీఆర్​ఎస్​ చుట్టూ ఉచ్చు

    రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాళేశ్వరం (Kaleshwaram) విచారణను ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ కేసు సీబీఐ టేకోవర్​ చేసుకుంటే కేసీఆర్​ (KCR) విచారణను ఎదుర్కోనున్నారు. మరోవైపు ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్​పై ఛార్జీషీట్​ దాఖలు చేయడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే కవిత (Kavitha) వ్యవహారంతో బీఆర్​ఎస్​ నేతలు ఆందోళన చెందుతున్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కారు రేసు కేసులతో స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...