అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో ఈగల్ టీమ్ పోలీసులు(Eagle Team Police) సోమవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో రూ.5 కోట్లు విలువైన 935 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు.
Hyderabad | పండ్ల ట్రేలలో రవాణా..
గంజాయిని ఒడిశా నుండి మహారాష్ట్ర(Maharashtra)కు తరలిస్తుండగా గంజాయి ఈగల్ టీమ్ పట్టుకుంది. వీరు ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని ప్యాకెట్లలో నింపి పండ్ల ట్రేలలలో ఉంచి డీసీఎంలో తరలిస్తున్నారు. అయితే ఈగల్ టీం సభ్యులు వీరి ఆట కట్టించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న పవార్ కుమార్తో పాటు సమాధాన్ బిస్, వినాయక్ పవార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి గంజాయి సరఫరా చేసిన విక్కీ సేథ్, సచిన్ గంగారాం చౌహాన్ పరారిలో ఉన్నట్లు వెల్లడించారు.
Hyderabad | ఈగల్ టీమ్ దూకుడు
హైదరాబాద్(Hyderabad) నగరంలో కొన్నేళ్లుగా గంజాయి, డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. అలాగే నగరం మీదుగా మహారాష్ట్ర, బెంగళూరు వంటి ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణకు ఈగల్ టీమ్ ఏర్పాటు చేసంది. ఈ ఈగల్ టీమ్ సభ్యులు దూకుడు పెంచారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఈగల్ టీమ్ గంజాయి, డ్రగ్స్ దందాలపై మెరుపు దాడులు చేస్తోంది. తాజాగా రూ.5 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకొంది. ఇటీవల మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ను ఛేదించింది. అలాగే పలువురు గంజాయి విక్రేతలను సైతం అరెస్ట్చేసింది. డెకాయి ఆపరేషన్ నిర్వహించి గంజాయికి బానిసైన వారిని అదుపులోకి తీసుకొని డి అడిక్షన్ సెంటర్కు తరలించింది.