HomeతెలంగాణABVP Nizamabad | మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి

ABVP Nizamabad | మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: ABVP Nizamabad | ప్రజాస్వామ్య దేశంలో హింస ద్వారా ఏది సాధించలేరని ఏబీవీపీ ఇందూరు విభాగ్ (ABVP Indure Vibhag) శశిధర్ అన్నారు. మావోయిజం పేరుతో మావోయిస్టులు (Maoists) సాధించింది శూన్యమన్నారు. నగరంలోని వర్ని చౌరస్తా నుంచి ఆర్​ఆర్ చౌరస్తా(RR Chowrastha) వరకు శుక్రవారం నక్సలిజానికి వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్రం తెలంగాణ ఉద్యమం కూడా అహింసా మార్గంలోనే సాధించుకున్నామన్నారు.

కొంతమంది మేధావుల రూపంలో చలామణి అవుతున్న అర్బన్ నక్సల్స్​ యూనివర్సిటీకి వచ్చే పేద విద్యార్థులకు మాయమాటలు చెప్పి అడవుల్లోకి వెళ్లేట్లు ప్రోత్సహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ (Operation Green Hunt) కొనసాగింపే ఈ ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) అని తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బాలకృష్ణ, ప్రేమ్ కుమార్, ప్రణీత్, సన్నీ, మున్నా, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.