HomeUncategorizedMaoists Letter | మావోయిస్టుల సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

Maoists Letter | మావోయిస్టుల సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maoists Letter : సమ సమాజ స్థాపనే లక్ష్యంగా సగర్వంగా ఎగిరిన ఎర్రజెండా ఇప్పుడు దారం తెగిన పతంగిలా మారింది. ఒకనాడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన నక్సలిజం(Naxalism) నేడు తుడిచి పెట్టుకుపోయే దుస్థికి చేరినట్లే కనిపిస్తోంది.

నక్సలిజాన్ని Naxalism అంతమొందిస్తామన్న కేంద్రం ఆ దిశగా చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar) అంతిమ దశకు చేరుకుంది. రాజ్యం నిర్బంధం, బలగాల దిగ్బంధంతో మావోయిస్టులకు ఊపిరి ఆడటం లేదు.

వరుస ఎన్​కౌంటర్లలో వందలాది మంది నేలకొరుగుతున్నారు. మరికొందరు జనజీవన స్రవంతిలో కలిసి పోతున్నారు. కేడర్ కనుమరుగై పోతున్న తరుణంలో, పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిన తరుణంలో మావోయిస్టు నాయకత్వం (Maoist leadership) పునరాలోచనలో పడింది.

ఈ మేరకు మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ కగార్​ Operation Kagar ను తక్షణమే నిలిపివేసి, ఎన్​కౌంటర్​లు ఆపేస్తే.. తాము ఆయుధాలు వదిలేస్తామని ప్రకటించారు.

ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఇది మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల అయింది. దీనిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా Union Home Minister Amit Shah కు మావోయిస్టులు రాశారు.

Maoists Letter : ఎన్​కౌంటర్​లు..

CPI మావోయిస్టు CPI Maoist అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడులైన ఈ లేఖ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

భారత్​ గడ్డ Indian soil పై 2026 మార్చి లోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా Union Home Minister Amit Shah ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనికితోడు Operation Kagar పేరుతో ఇటీవల రోజుకో ఎన్​కౌంటర్​ అన్నట్లుగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఆపరేషన్​ కగార్​లో భాగంగా జరుగుతున్న ఎన్​కౌంటర్​లలో మావోలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ తరుణంలో మావోయిస్టుల తాజా నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.