Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం ముగింపు దశకు వచ్చింది. ద‌శాబ్దాల మావోయిస్టు పార్టీ ఇక కాల‌గ‌మ‌నంలో క‌లిసిపోనుంది. వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల‌తో పాటు లొంగుబాట్ల‌తో పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ త‌గిలింది. కేంద్ర క‌మిటీ స‌భ్యులు స‌హా వంద‌లాది మంది హ‌తం కావ‌డం, అదే స్థాయిలో లీడ‌ర్లు, కేడ‌ర్ లొంగిపోవ‌డం, కొత్త రిక్రూట్‌మెంట్లు లేక‌పోవ‌డంతో ద‌శాబ్దాల చరిత్ర […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం ముగింపు దశకు వచ్చింది. ద‌శాబ్దాల మావోయిస్టు పార్టీ ఇక కాల‌గ‌మ‌నంలో క‌లిసిపోనుంది. వ‌రుస ఎన్‌కౌంట‌ర్ల‌తో పాటు లొంగుబాట్ల‌తో పార్టీకి కోలుకోలేని రీతిలో దెబ్బ త‌గిలింది. కేంద్ర క‌మిటీ స‌భ్యులు స‌హా వంద‌లాది మంది హ‌తం కావ‌డం, అదే స్థాయిలో లీడ‌ర్లు, కేడ‌ర్ లొంగిపోవ‌డం, కొత్త రిక్రూట్‌మెంట్లు లేక‌పోవ‌డంతో ద‌శాబ్దాల చరిత్ర క‌లిగిన పార్టీ ఇక చ‌రిత్ర‌లో మిగిలి పోయే స్థితికి చేరింది.

మావోయిస్ట్​ పార్టీ సెక్రెటరీ తిప్పిరి తిరుపతి (Tippiri Tirupati) అలియాస్​ దేవ్​జీ, పోలిట్​ బ్యూరో సభ్యుడు రాజిరెడ్డి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా ఉన్న నంబాల కేశవరావు (Nambala Keshava Rao) గత ఏడాది మే నెలలో జరిగిన ఎన్​కౌంటర్​లో మృతి చెందాడు. అనంతరం సెప్టెంబర్​లో దేవ్​జీకి పార్టీ ఆ బాధ్యతలు అప్పగించింది. ఆపరేషన్​ కగార్​తో మావోయిస్టులు భారీ సంఖ్యలో హతం అయ్యారు. కొత్తగా రిక్రూట్​మెంట్లు సైతం లేవు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకు మాత్రమే వారు పరిమితం అయ్యారు. ఈ క్రమంలో దేవ్​జీ పార్టీ సెక్రెటరీగా నియామకం అయ్యారు. పార్టీని ముందుడి నడపాల్సిన ఆయన తాజాగా లొంగిపోయారు. దీంతో కేడర్​లో సైతం నిస్తేజం అలుముకునే అవకాశం ఉంది.

Maoist Movement End Phase | కేడర్​లో అయోమయం

జగిత్యాల (Jagityal) జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ నగర్​కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ మిలటరీ ఆపరేషన్లలో దిట్ట. గతంలో ఆయన పలు కీలక బాధ్యతల్లో పనిచేశారు. నంబాల మృతితో ఖాళీగా ఉన్న పదవికి పలువురి పేర్లు పరిశీలనలోకి రాగా.. కేంద్ర కమిటీ తిరుపతి వైపు మొగ్గు చూపింది. అయితే ఆయన లొంగుబాటు పార్టీకి షాక్​ అని చెప్పాలి. మరోవైపు పెద్దపల్లికి మల్లా రాజిరెడ్డి (Malla Rajireddy) సైతం సరెండర్​ అయ్యారు. ఆయన ప్రస్తుతం పోలిట్​ బ్యూరో సభ్యుడిగా కొనసాగున్నారు. వీరితో పాటు మరో 14 మంది లొంగిపోయినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఒకటి, రెండు రోజుల్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పార్టీ అగ్ర నాయకత్వం ఎన్​కౌంటర్​లలో హతం అవుతుండటం, లొంగిపోతుండటంతో కేడర్​లో అయోమయం నెలొకొంది. దీంతో వారు సైతం ఆయుధాలు వీడే అవకాశం ఉంది.

Maoist Movement End Phase | ఆపరేషన్​ కగార్​ విజయవంతం

దేశంలో నాలుగు దశాబ్దాలకు పైగా మావోయిస్ట్​ పార్టీ మనుగడ సాగించింది. పశ్చిమ బెంగాల్​లోని నక్సల్​బరిలో పుట్టి అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఛత్తీస్​గఢ్​, తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్​, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, ఒడిశాలో మావోల ప్రాబల్యం అధికంగా ఉండేది. 2004 తర్వాత ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే ఇతర రాష్ట్రాలో వారు బలంగానే ఉండేవారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మావోలపై నిర్బంధం అమలు చేసింది. 2026 మార్చి 31 వరకు మావోయిజం లేకుండా చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. ఈ ఆపరేషన్​ విజయవంతం అయింది.

Maoist Movement End Phase | రక్షణకే పరిమితం

వేలాది బలగాలు అడవులను జల్లెడ పట్టాయి. గతంలో మావోయిస్టులు పోలీసులు, నాయకులపై దాడులు చేసేవారు. ఆపరేషన్​ కగార్​ ధాటికి వారు తమను తాము రక్షించుకోవడంపై దృష్టి పెట్టారు. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పట్టాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోని మావోయిస్టుల పని పట్టాయి. గతంలో నక్సల్స్​కు కంచుకోటగా ఉన్న ప్రాంతాలను సైతం బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీంతో మావోయిస్ట్​లకు షెల్టర్​ జోన్లు కరువయ్యాయి. ఈ క్రమంలో వందలాది మంది ఎన్​కౌంటర్లలో చనిపోగా.. మిగతా వారు ఆయుధాలు వీడి సరెండర్​ అవుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు మావోయిస్ట్​ ఉద్యమం పట్ల నేటి యువత ఆకర్షితులు కావడం లేదు. దీంతో రిక్రూట్​మెంట్లు లేక పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా కీలక నేతలు లొంగిపోవడంతో కేంద్రం పెట్టుకున్న గడువు ప్రకారం.. మార్చి 31 లోగా మావోయిజం అంతం అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.

దామోదర్​ కోసం వేట

మావోయిస్టు పార్టీలో కొంత మంది కీలక నేతలు మాత్రమే ప్రస్తుతం ఉద్యమంలో ఉన్నారు. అందులో గణపతి అలియాస్​ లక్ష్మణ్​రావు అనారోగ్యంతో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. మరో నేత బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ మాత్రం అడవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడి కోసం బలగాలు గాలిస్తున్నాయి. మొత్తంగా పార్టీలో 300 లోపు మావోయిస్టులు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరి కోసం అడవుల్లో గాలిస్తున్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...

Yendala Arrest | యెండల లక్ష్మీనారాయణ అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ...