Maoist Devji | పోలీసుల అదుపులో మావోయిస్ట్​ నేత దేవ్​జీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Devji | మావోయిస్ట్​ పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యుడు దేవ్​జీ అలియాస్​ తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (Special Zone Committee) ఆరోపిస్తోంది. ఆయనతో పాటు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. వారిని కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు లేఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల ఎన్​కౌంటర్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Devji | మావోయిస్ట్​ పార్టీ పోలిట్​ బ్యూరో సభ్యుడు దేవ్​జీ అలియాస్​ తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నారని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (Special Zone Committee) ఆరోపిస్తోంది. ఆయనతో పాటు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. వారిని కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్​ చేసింది. ఈ మేరకు లేఖ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh)లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల ఎన్​కౌంటర్​ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు చోటు చేసుకున్న ఎన్​కౌంటర్లో మావోయిస్ట్​ కీలక నేత మాడ్వి హిడ్మా (Madvi Hidma), ఆయన భార్య రాజే, టెక్​ శంకర్​ సహా పలువురు మృతి చెందారు. అనంతరం తెలంగాణ పోలీసుల ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ సమయంలో దేవ్​జీ కూడా లొంగిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాల సాంబయ్య అలియాస్​ ఆజాద్​ సహా పలువురు సరెండర్​ అయ్యారు.

Maoist Devji | దండకారణ్యం బంద్​కు పిలుపు

హిడ్మా ఎన్​కౌంటర్​ సమయంలోనే దేవ్​జీ సహా 50 మందిని అదుపులోకి తీసుకున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. హిడ్మా ఎన్​కౌంటర్​ బూటకమని లేఖలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న దండకారణ్యం బంద్‌కు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ పిలుపునిచ్చింది. దేవ్​జీని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని కోరింది. అయితే మావోయిస్టుల లేఖపై తెలంగాణ పోలీసులు (Telangana Police) స్పందించారు. దేవ్​జీ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. దేవ్​జీ బంధువులు ఏపీ కోర్టులో పిటిషన్​ వేశారు. దీంతో ఆ రాష్ట్ర పోలీసులు సైతం తమ ఆధీనంలో లేరని కోర్టుకు తెలియజేశారు.

తాము ఆయుధాలు వీడేందుకు సిద్ధమని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్ (ఎంఎంసీ)​ జోనల్​ కమిటీ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మరోవైపు దండకారణ్యం బంద్​కు స్పెషల్ జోన్ కమిటీ పిలుపునిచ్చింది. దీంతో రెండు కమిటీలు కలిసి ఆయుధాలు వీడుతాయా.. లేక ఎంఎంసీ కమిటీ సభ్యులు మాత్రమే సరెండర్​ అవుతారా అనేది తెలియాల్సి ఉంది.

Related articles

Maoist Devji Surrenders | రాజకీయాల్లోకి వస్తా.. దేవ్​జీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Devji Surrenders | మావోయిస్ట్​ పార్టీ సెక్రెటరీ దేవ్​జీ అలియాస్ తిప్పిరి తిరుపతి (Thippiri Tirupati) మంగళవారం డీజీపీ...

సలహాలకు ఫుల్ స్టాప్.. సర్వీస్ కు భరోసా.. గోద్రేజ్ ఏసీల కొత్త ప్రచార చిత్రం విడుదల

ముంబై: ప్రముఖ గృహోపకరణాల సంస్థ 'గోద్రేజ్ అప్లయన్సెస్' వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ప్రముఖ నటుడు దేవన్ భోజాని ప్రధాన పాత్రలో...

Telangana Cabinet Decisions | రాష్ట్ర కేబినెట్​ నిర్ణయాలపై టీజీఈజేఏసీ హర్షం..

రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయంపై టీజీఈజేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం కమిటీ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​కుమార్​ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Forest Officer Bribery Case | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Officer Bribery Case | మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB)కి చిక్కింది. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ...