అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists Surrender | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత సుజాతక్క శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఆపరేషన్ కగార్(Operation Kagar)తో కకావికలం అవుతున్న మావోయిస్ట్లను లొంగుబాట్లు తీవ్ర కలవర పెడుతున్నాయి. ఓ వైపు ఎన్కౌంటర్లలో వందలాది మంది దళ సభ్యులు చనిపోతుండగా.. మరోవైపు కీలక నేతలు సైతం ఉద్యమాన్ని వీడుతున్నారు. తాజాగా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ(Maoist Central Committee) సభ్యురాలిగా కొనసాగుతున్న సూజాతక్క లొంగిపోయారు.
Maoists Surrender | 106 కేసుల్లో నిందితురాలు
గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్నారు. ఆమె కీలక ఆపరేషన్లలో పాలు పంచుకున్నారు. అంతేగాకుండా మావోయిస్ట్ అగ్రనేత కిషన్జీని 1984లో కిషన్జీని పెళ్లి చేసుకున్నారు. సూజాతక్క 106 కేసుల్లో నిందితురాలిగా ఉండగా.. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమెతో పాటు మరికొంత మంది దళ సభ్యులు సైతం శనివారం లొంగిపోయినట్లు సమాచారం.
Maoists Surrender | ఏకైక మహిళ నాయకురాలు
మావోయిస్ట్(Maoists) పార్టీ సెంట్రల్ కమిటీలో ఉన్న ఏకైక మహిళ నేత సుజాతక్క కావడం గమనార్హం. సెంట్రల్ కమిటీలో చాలా మంది తెలుగు వారే ఉన్నారు. కమిటీ సెక్రెటరీగా ఇటీవల జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి నియామకం అయ్యారు. అయితే రాష్ట్రానికి చెందిన సూజాతక్క తాజాగా తుపాకీని వీడి లొంగిపోవడం గమనార్హం. ఆమె భర్త కిషన్జీ 2011లో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్కౌంటర్ మృతి చెందాడు. ఆమె ప్రస్తుతం ఛత్తీస్గడ్ సౌత్ ఏరియాకు సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు.సుజాత లొంగుబాటుపై డీజీపీ జితేందర్(DGP Jitender) మీడియాతో మాట్లాడారు. అనారోగ్య కారణాలతో ఆమె లొంగిపోయినట్లు వెల్లడించారు. ఆమెకు రూ.25 లక్షల క్యాష్ రివార్డు ఇస్తామన్నారు. మిగతా వారు సైతం లొంగిపోవాలని ఆయన సూచించారు.