అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoist Devji Surrenders | మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి (Thippiri Tirupati) మంగళవారం డీజీపీ శివధర్రెడ్డి (DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోయారు. మీడియా ఎదుట డీజీపీ వివరాలు వెల్లడించారు.
దేవ్జీతో పాటు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్ల రాజిరెడ్డి, బడె చొక్కారావు, నూనె నర్సింహారెడ్డిపై సరెండర్ అయ్యారు. అనంతరం దేవ్జీ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య కారణాల రీత్యా రహస్య జీవితం నుంచి బహిరంగ జీవితంలోకి వచ్చానని చెప్పారు. ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితం కోసం నేను బయటకు రాలేదని చెప్పారు. తాను రాజకీయ జీవితాన్ని కచ్చితంగా కొనసాగిస్తానన్నారు. అయితే పార్టీకి సంబంధించిన పూర్తి విషయాలు త్వరలో చెబుతానని తెలిపారు.
Maoist Devji Surrenders | ప్రజా సమస్యలపై..
ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి పని చేస్తామని రాజిరెడ్డి తెలిపారు. ప్రజా పోరాటాలను సంఘటితం చేయడానికి చట్ట పరిధిలోనే పని చేస్తామన్నారు. దేవ్జీతో పాటు 40 మందిని ఎస్ఐబీ పోలీసులు (SIB Police) మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చాలా మంది మావోయిస్టులు అజ్ఞాతం వీడి బయటకు వస్తున్నారని చెప్పారు. తిప్పిరి తిరుపతిపై రూ.25 లక్షల రివార్డు, రాజిరెడ్డిపై రూ.25 లక్షలు, చొక్కారావుపై రూ.20 లక్షలు, నర్సింహారెడ్డిపై రూ.20 లక్షల రివార్డు ఉందన్నారు.
తెలంగాణకు చెందిన 11 మంది కీలక మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన కోరారు. మొప్పల లక్ష్మణ్ అలియాస్ గణపతి అడవుల్లో లేరని, బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. మరో కీలక నేత సుదర్శన్ ఒడిశాలో ఉన్నట్లు పేర్కొన్నారు.
