ePaper
More
    HomeజాతీయంPM Modi | చాలా దాడులు చేశారు.. ఇక ఆపండని పాక్​ వేడుకుంది : ప్రధాని...

    PM Modi | చాలా దాడులు చేశారు.. ఇక ఆపండని పాక్​ వేడుకుంది : ప్రధాని మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆపరేషన్​ సిందూర్​ (Operation Sindoor)తో మన సత్తా చాటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చాలా దాడులు చేశారు, ఇక తట్టుకోలేం ఆపండని పాక్​ (Pakistan) కోరడంతోనే కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించామని ఆయన వెల్లడించారు. లోక్​సభలో ఆపరేషన్​ సిందూర్​పై చర్చకు మంగళవారం ఆయన సమాధానం ఇచ్చారు. ఏప్రిల్ 22న ఉగ్రవాదులు పహల్గామ్​లో దాడి (Pahalgam Terror Attack)కి పాల్పడ్డారన్నారు. ఈ దాడి క్రూరత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. దేశం ఐక్యంగా నిలిచి ఉగ్రవాదుల కుట్రను తిప్పికొట్టిందన్నారు. భారత దళాలు ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి 22 నిమిషాల్లో ఏప్రిల్​ 22 ఘటనకు ప్రతీకారం తీర్చుకున్నాయని మోదీ తెలిపారు.

    PM Modi | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

    పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని తాను హెచ్చరించినట్లు మోదీ గుర్తు చేశారు. ఈ మేరకు ఉగ్రవాదులు, వారి శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్​ సిందూర్​ చేపట్టామన్నారు. ఆపరేషన్​ సమయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని మోదీ తెలిపారు. భారత ప్రతీకార చర్య చూసి పాకిస్తాన్​ బిత్తరపోయిందన్నారు. ఉగ్రవాదులు మళ్లీ కోలుకోలేని విధంగా శిక్షించినందుకు గర్విస్తున్నాని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత వాళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. భారత్ సత్తా ఎవరికైతే కనిపించడం లేదో వారికి కళ్లద్దాలు కొనిస్తానని చురకలు వేశారు.

    PM Modi | ఎవరు ఒత్తిడి చేయలేదు..

    ఆపరేషన్​ సిందూర్​ ఆపమని భారత్​పై ఏ దేశం ఒత్తిడి చేయలేదని మోదీ స్పష్టం చేశారు. ఆపరేషన్​ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు (America Vice President) తనకు ఫోన్​ చేశారన్నారు. పాకిస్తాన్​ పెద్ద దాడి చేయబోతుందని ఆయన చెప్పారన్నారు. అయితే దాడి చేస్తే వారు చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పానన్నారు. తాము బుల్లెట్లు, బాంబులతో జవాబు చెబుతామని స్పష్టం చేశానన్నారు. పాక్​ డీజీఎంవో ఫోన్​ చేసి దాడులు ఆపాలని కోరడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామన్నారు.

    PM Modi | మేడిన్​ ఇండియా ఆయుధాలతో..

    ఆపరేషన్​ సిందూర్​ సమయంలో మేడిన్​ ఇండియా (Made in India) ఆయుధాలు కీలక పాత్ర పోషించాయని ప్రధాని తెలిపారు. ఆపరేషన్​ సిందూర్​తో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. అనంతరం పాక్​ డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు తెగబడిందన్నారు. అయితే భారత రక్షణ వ్యవస్థ వాటిని సమర్థవంతంగా అడ్డుకుందన్నారు. అనంతరం పాక్​ ఎయిర్​బేస్​లకు తీవ్ర నష్టం కలిగించామని వెల్లడించారు. దాయాదీ దేశం ఎయిర్​బేస్​లు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు భయపడమని ఆపరేషన్​ సిందూర్​తో తేల్చి చెప్పామన్నారు. భారత్​ ప్రతిస్పందన గతంలో కంటే కఠినంగా ఉందని పాకిస్తాన్ తెలిసిందన్నారు. ఏళ్ల తరబడి గుర్తుంచుకునేలా ఆ దేశానికి మన సేనలు గుణపాఠం చెప్పాయన్నారు.

    PM Modi | పాకిస్తాన్​ ప్రతినిధిగా కాంగ్రెస్​

    ఆపరేషన్​ సిందూర్​ సమయంలో ప్రపంచంలో ఉన్న 193 దేశాల్లో 3 దేశాలు మాత్రమే పాక్​కు మద్దతుగా నిలిచాయన్నారు. ప్రపంచం మొత్తం భారత్​ను సమర్థించిందని మోదీ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్​ (Congress) మాత్రం మద్దతుగా నిలవలేదని ఆయన ఆరోపించారు. ఉగ్రవాదులను అంతం చేయడం, వారి స్థావరాలను ధ్వంసం చేయడం ఆపరేషన్​ సిందూర్​ లక్ష్యమని మోదీ తెలిపారు. ఆ లక్ష్యాలను 100 శాతం సాధించామన్నారు. అయితే కొందరు

    పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకు పోతున్నారని కాంగ్రెస్​ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయ లాభం కోసం చూస్తోందన్నారు కాంగ్రెస్ మన హీరోల ధైర్యాన్ని సమర్థించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పాకిస్తాన్ ప్రచారం, కుట్రలకు ప్రతినిధిగా మారిపోయిందని విమర్శించారు.

    Latest articles

    GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణలో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో...

    Officers Retirement | ఒకేసారి ఐదుగురు అధికారుల పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన ఆయా శాఖల సిబ్బంది

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Officers Retirement : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు...

    Collector | కమ్మర్​పల్లి, మోర్తాడ్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...

    Task force raids | వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి.. పలువురి అరెస్టు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Task force raids : నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడులు...

    More like this

    GST fraud | భారీ జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్

    అక్షరటుడే, హైదరాబాద్: GST fraud : తెలంగాణలో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో...

    Officers Retirement | ఒకేసారి ఐదుగురు అధికారుల పదవీ విరమణ.. వీడ్కోలు పలికిన ఆయా శాఖల సిబ్బంది

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Officers Retirement : నిజామాబాద్ జిల్లా(Nizamabad district)లో వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు...

    Collector | కమ్మర్​పల్లి, మోర్తాడ్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు.. ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector : కమ్మర్ పల్లి, మోర్తాడ్ (Mortad)మండల కేంద్రాలలో బుధవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి...