అక్షరటుడే, వెబ్డెస్క్: Manam Movie | ఇండియన్ సినిమాలపై జపాన్ ప్రజల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రజనీకాంత్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు అక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో కింగ్ నాగార్జున (Hero Nagarjuna) కూడా చేరిపోయారు. ఆయనకు జపాన్లో ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉందని చెప్పొచ్చు. అందుకు తాజా ఉదాహరణగా జపాన్లో రీరిలీజ్ నిలుస్తోంది ‘మనం’ మూవీ (Manam Movie). తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు జపాన్కు చేరింది. ఆగస్టు 8న నాగార్జున కుటుంబ కథా చిత్రం ‘మనం’ జపాన్లో రీరిలీజ్ (Japan Re Release) అవుతోంది.
బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున నటన చూసి జపనీస్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు, ఇటీవల విడుదలైన ‘కుబేర’ సినిమా ఓటీటీలో హిట్ అవడంతో జపాన్లో టాప్ ట్రెండింగ్ చిత్రంగా నిలిచింది. దీనివల్ల ‘మనం’కు అక్కడ డిమాండ్ పెరిగింది. జపనీస్ అభిమానులు నాగార్జునను ‘నాగ్ సామ’ అని పిలుస్తున్నారు. జపాన్ సంస్కృతిలో ‘సామ’ అనేది గౌరవప్రదమైన పదం. దేవుళ్లు, రాజులు, లెజెండ్స్ను మాత్రమే ఇలా పిలుస్తారు. ఇది నాగార్జునకు వారు ఇచ్చిన గొప్ప గౌరవానికి నిదర్శనం. ‘మనం’ రీ రిలీజ్ సందర్భంగా నాగార్జున జపాన్ ఫ్యాన్స్తో (Japan Fans) ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాల్ (Zoom/Google Meet) ద్వారా జపాన్ థియేటర్లలో మూవీ చూస్తున్న అభిమానులతో అతను మాట్లాడనున్నారు. ఇది ఆ ఫ్యాన్స్కు మర్చిపోలేని క్షణం కానుంది.
‘కుబేర’ హిట్ తర్వాత నాగార్జున లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’లో విలన్గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఆగస్టు 14న ‘కూలీ’ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై అమితాససక్తిని కనబరుస్తున్నారు. జపాన్లో తెలుగు సినిమాలకు, నటులకు దక్కుతున్న గుర్తింపు గర్వించదగిన విషయం. ఇప్పుడు నాగార్జునకు అక్కడ ఉన్న ఆదరణ ‘మనం’ రీ రిలీజ్ రూపంలో మరింత బలపడుతోంది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి తెలియజేస్తున్న ఈ తరహా పరిణామాలు మన పరిశ్రమ అభివృద్ధికి శుభపరిణామమే అని చెప్పాలి.