Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి: కలెక్టర్​

Collector Nizamabad | పాఠశాలల నిర్వహణ మెరుగుపడాలి: కలెక్టర్​

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా ఎంఈవోలు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్​లో మంగళవారం ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. నగరంలోని కలెక్టరేట్​లో మంగళవారం ఎంఈవోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

Collector Nizamabad | ఉత్తీర్ణత శాతం పెంచాలి..

ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడేలా కష్టపడాలని కలెక్టర్​ అన్నారు. మరమ్మతు పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎంఈవోలు (MEO), ప్రధానోపాధ్యాయులకు తెలిసి ఉండాలన్నారు. ఏ పనులకు ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి, పనులు చేపట్టాల్సిన ఏజెన్సీ గురించి వివరాలు సేకరించి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Collector Nizamabad | మధ్యాహ్న భోజనం పథకం​లో నిర్లక్ష్యం వద్దు..

మధ్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్​ సూచించారు. ఏజెన్సీల నిర్వాహకులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లోనూ విద్యార్థులకు సంబంధించి అపార్ జనరేట్ అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. ఓపెన్ స్కూల్స్​లో ప్రవేశాలు గణనీయంగా చేపట్టారని అదే స్ఫూర్తితో పాఠశాలల్లో కూడా అడ్మిషన్స్ జరిగేలా కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit), డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar), డీఈవో అశోక్ (DEO Ashok) తదితరులు పాల్గొన్నారు.