అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | అత్యవసర సమయంలో పోలీసులకు ఫోన్ చేయడానికి ఉన్న డయల్ 100 (Dial 100)ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. అనవసరంగా ఫోన్ చేసి సిబ్బందిని విసిగిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తాజాగా డయల్ 100ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని కూకట్పల్లిలో నివాసం ఉండే కేతావత్ పరుశురామ్ ఇటీవల డయల్ 100కు అనవసరంగా ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి నిజామాబాద్ (Nizamabad) సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట సోమవారం హాజరు పరిచారు. దీంతో నిందితుడికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.