ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

    Nizamsagar | చెట్టుకు ఢీకొని వ్యక్తి మృతి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | చెట్టును టీవీఎస్​ ఎక్సెల్​​ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సుల్తాన్​నగర్​ శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ నగర్ (mahammad nagar) మండల కేంద్రానికి చెందిన గని(30) అనే వ్యక్తి పెట్రోల్​ విక్రయిస్తూ జీవిస్తున్నాడు.

    సోమవారం ఉదయం నిజాంసాగర్​లోని పెట్రోల్​ పంప్​కు (Petrol pump) వెళ్తుండగా సుల్తాన్​పూర్​ గ్రామ శివారులో కల్లు దుకాణం వద్ద ఎక్సెస్​ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలు కాగా గని అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య షహనాజ్​ ఫిర్యాదు మేరకు ఎస్సై శివకుమార్​ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...