Homeక్రైంEncounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్.. 20 మంది మావోయిస్టుల మృతి

Encounter | ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్.. 20 మంది మావోయిస్టుల మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | ఛత్తీస్​గఢ్​లో (Chhattisgarh) మరోసారి భారీ ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. నారాయ‌ణ‌పూర్ జిల్లా (Narayanpur district) మాధ్‌ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య బుధవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్​ కగార్​లో (operation kagar) భాగంగా బీజాపూర్, నారాయ‌ణ‌పూర్‌, దంతెవాడ డీఆర్‌జీ బ‌ల‌గాలు క‌లిసి కూంబింగ్ నిర్వ‌హించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు (maoists) ఎదురు పడటంతో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మాధ్ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో నక్సల్స్​ మావోలు (Naxals and Maoists) ఎదురుపడటంతో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఉదయం నుంచి భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

తెలంగాణ–ఛత్తీస్​గఢ్​ సరిహద్దులోని (Telangana-Chhattisgarh border) కర్రెగుట్టల్లో ఇటీవల ఆపరేషన్​ కగార్​ ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. 20 రోజుల పాటు బలగాలను అడవులను జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్​లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. కర్రెగుట్టల (Karregutta) నుంచి మావోలు తప్పించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో బలగాలు అక్కడ కూంబింగ్​ చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే నారాయణపూర్​ జిల్లాలో ఎన్​కౌంటర్​ (encounter) చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత నంబళ్ల కేశవరావు (Maoist top leader Namballa Kesava Rao) అలియాస్ బసవరాజు మృతిచెందినట్లు సమాచారం.